Current Date: 04 Jul, 2024

బొత్సా గుండు ఎప్పుడు గొరిగించుకుంటారు?

ఎన్నికల ముందు నోరు జారిన మాజీ మంత్రి సత్తిబాబు ఇప్పుడు గుండు గీయించుకోవలసి వస్తోంది.ఒక ప్రచార సభలో టీడీపీ, జనసేన  పార్టీ లు రెండూ వుండవు వచ్చే కొత్త అమావాస్య తరువాత ఈ రెండు రాజకీయ పార్టీ లూ ఉంటే గుండు గీయించు కుంటాను అని బహిరంగంగా ప్రకటించేశారు. ఇదే ఇప్పుడు తలనొప్పయి కూర్చుంది. టీడీపీ, జనసేన కూటమి విజయ భేరి మోగించి తిరుగులేని మెజారిటీ ని సాధించి అధికారం లోకి వచ్చేసిందిమరి కొత్త అమావాస్య వెళ్ళిపోయింది... మరి గుండు ఎప్పుడు గీయించు కుంటావు అంటూ బొత్స సత్తిబాబు ను నెట్ జెన్ లు ట్రోల్ చేస్తున్నారుకనీసం చీపురుపల్లి లో గెలిచినా దేవుడి మొక్కు అంటూ గుండు గీయించుకు వచ్చేవారు. ఇప్పుడు సాంతం రాష్ట్ర మంతా చిత్తు చిత్తు గా ఓడిపోయి ఇంట్లో నుంచి బయటకే రావడం లేదు అందుకే ఎప్పుడు గుండు గీయించు కుంటావు అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు సత్తిబాబు వెంట పడుతున్నారు.

Share