Current Date: 04 Jul, 2024

అయ్యన్నతో దాడి వీరభద్రరావు భేటీ

 నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడ్ని మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు మర్యాద పూర్వకంగా కలిశారు. అయ్యన్న స్వగృహంలో గురువారం ఇద్దరూ కాసేపు కలుసుకుని తాజా రాజీకాయాలపై చర్చించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిరదని, సీఎంగా చంద్రబాబు ఈ రాష్ట్రానికి మంచి చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారని, మనం కూడా అదే రీతిలో ప్రజల సమస్యలపై దృష్టి సారిద్దామంటూ ముగించారు. అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్ కానున్న నేపథ్యంలో అయ్యన్నకు దాని ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఆకాంక్షించారు.

Share