Current Date: 05 Oct, 2024

హూ కిల్ల్డ్ బాబాయ్ చంద్రబాబు సంచలన ప్రకటన

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసు పలు మలుపులు తిరిగిందని  ఈ కేసులోని కొందరు ముఖ్య నిందితులను అరెస్ట్ చేయలేక సీబీఐ వాళ్లు కూడా వెనక్కి వచ్చారని అన్నారు. కానీ హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో డ్రగ్స్, గంజాయ్ విపరీతంగా పెరిగాయని  ఇప్పుడు ఈ డ్రగ్స్, గంజాయ్ లను,  ఉక్కుపాదంతో అణిచివేస్తామని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో నేరాలు చేయాలనుకుంటే ఊరుకునేది లేదని ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించే బాధ్యత మాదని స్పష్టం చేశారు.  ఇటుక ఇటుక పేర్చుకుంటూ వస్తున్నామని  రాష్ట్ర ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను నేరవేర్చుతామని స్పష్టం చేశారు.  ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి తీసి తీరుమాని బాబు వాగ్ధానం చేశారు.

Share