Current Date: 06 Jul, 2024

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల.... నవరత్నాలకు అప్ గ్రేడ్ వెర్షన్..

ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల   కానుంది. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో  మేనిఫెస్టోను  ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ విడుదల చేయనున్నారు. నవరత్న హమీలను కొనసాగించనున్నారు. అంతేకాకుండా డీబీటీ పధకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పనపై  వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించినట్టు  సమాచారం. ఈసారి పేదలతో పాటు  మధ్య తరగతి వర్గాలకు కూడా  లబ్ది చేకూర్చే పధకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అన్నివర్గాలను  ఆకట్టుకోవడానికి సీయం వైయస్ జగన్ ఎలాంటి హమీలు ఇవుబోతున్నారు ? అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.