Current Date: 05 Oct, 2024

వైసీపీ మబ్బులు విడిపోలేదా? వింత వాదన తెరపైకి

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై వైయస్ జగన్ సమీక్ష సాఫీగా జరిగేలా కనిపించడం లేదు. పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఈవీఎంల ట్యాంప‌రింగ్‌ అని కొంత మంది నేతలు వింత వాదన తెరపైకి తెచ్చారు. నిజానికి రాజకీయాల్లో ఓట‌మిని మొద‌ట హుందాగా అంగీక‌రించాలి. కానీ.. వైసీపీ ఆ పని చేస్తున్నట్లు కనిపించడం లేదు.ఐదేళ్ల పాల‌న‌లో తాము తీసుకున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో ఎందుకంత వ్య‌తిరేక‌త వ‌చ్చిందో తెలుసుకోవాలి. అన్ని వ‌ర్గాలు వైసీపీకి వ్య‌తిరేక‌మ‌య్యేంత‌గా తాను చేసిన త‌ప్పులేంటో జ‌గ‌న్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. అప్పుడు మాత్ర‌మే త‌ప్పుల్ని స‌రిదిద్దుకుని, తిరిగ ప్ర‌జ‌ల  వ‌ద్ద‌కు వెళ్లే అవ‌కాశం వుంటుంది.