Current Date: 04 Jul, 2024

నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణ దశలో ఉన్న వైసీపీ కార్యాలయ  భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్‌ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్‌ సర్కార్‌ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై ఆ పార్టీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 5.30కి అధికారులు పొక్లెయిన్లతో కూల్చివేత ప్రారంభించారు. ఇరిగేషన్‌ భూమిని ఆక్రమించి, అనధికారికంగా వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టిందని ఎంటీఎంసీ అధికారులు తెలిపారు

Share