Current Date: 04 Jul, 2024

పీక్‌ కి చేరిన ఎంవీవీ కష్టాలు!

ఇప్పటికే వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటమి పాలైన ఎంవీవీ కష్టాలు ‘పీక్‌’కు చేరాయి. విశాఖ నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పీక్‌’ ప్రాజెక్టుకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. ఇందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ స్థలంలో వున్న రాళ్ళను తొలగించేందుకు చేపట్టిన పేలుళ్ళ వల్ల చుట్టు పక్కల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేయాలంటూ జీవీఎంసీ నోటీసు జారీ చేసింది.

Share