Current Date: 04 Jul, 2024

ఐసీఏఐలో యోగాసనాలు

ది ఇన్సిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విశాఖ చాప్టర్ (ఎస్ఐర్సీ) ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని చార్టెర్డ్ అకౌంటెంట్ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా శుక్రవారం అంతర్జాతీయ యోగా డే సందర్భంగా పాల్గొని ఆసనాలు ప్రదర్శించారు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే థీమ్తో నిర్వహించిన ప్రదర్శన ద్వారా మానసిక ఒత్తిడిని జయించి శారీరక ధారుడ్యాన్ని పొందొచ్చని అకౌంటెంట్స్ పేర్కొన్నారు. సీఏ ఏయూలో యోగా డిప్లమో హోల్డర్ మింటె త్రిమూర్తులు విచ్చేసి సభ్యుల్ని చైతన్యపరిచారు. మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఏ అనిర్బాన్ పాల్ (బ్రాంచి చైర్మన్), సీఏ పట్నాల లోకేష్ (కార్యదర్శి, స్టూడెంట్స్ చైర్మన్), సీఏ వాసుదేవ మూర్తి (ఎడిటర్) తో పాటు స్టూడెంట్స్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

Share