Current Date: 06 Oct, 2024

రాష్ట్రంలో ఒకరోజు ముందు గా నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

రాష్ట్రంలో ఒకరోజు ముందు గా నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు.ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం సామాజిక పెన్షన్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే సెప్టెంబరు 1 ఆదివారం కావడం, ఆరోజు ప్రభుత్వోద్యోగులకు సెలవు ఉండడంతో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెన్షన్దారులకు ఒకరోజు ముందుగానే పింఛను లభించనుంది.  ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు నగదు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి రూ.2,730 కోట్ల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి అందించనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

Share