Current Date: 06 Oct, 2024

రామాలయ స్థలం కబ్జా!

ముదపాక పంచాయతీలోని సర్వే నంబర్‌ 92లో రామాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని అక్కడి ఎంపీటీసీ దేవి కుమారుడు శివ ఆక్రమించే ప్రయత్నం చేశాడు. ఈ విషయమై ప్రశ్నించేందుకు ఆదివారం రైతులు అక్కడకు చేరుకోగా వారిపై దుర్భాషలాడాడు. ఆరు సెంట్ల స్థలాన్ని చదును చేస్తుండగా గ్రామస్తులు కూడా అడ్డుకున్నారు. ఆక్రమణదారులపై చర్యలు చేపట్టి, స్థలాన్ని కాపాడాలంటూ రైతులు రెవెన్యూ సిబ్బందిని కోరుతూ విజ్ఞప్తి చేశారు.

Share