Current Date: 06 Oct, 2024

భారత క్రికెటర్ పంత్ సాయానికి విలువ లేకుండా చేసిన నెటిజన్లు!

భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాయానికి నెటిజన్లు నోటి దురుసుతో విలువ లేకుండా చేసేశారు. తన కాలేజీ ఫీజు కట్టడానికి ఎంతో కష్టపడుతున్నానని సాయం చేయాలంటూ ఓ విద్యార్థి భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ని ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టాడు. దాంతో స్పందించిన రిషబ్ పంత్ డబ్బులు పంపించాడు. కానీ.. నిమిషాల వ్యవధిలో ఎక్స్‌లో అది తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.  రిషబ్ పంత్‌ను ట్యాగ్ చేస్తూ కార్తికేయ మౌర్య అనే  విద్యార్థి తన ఎక్స్‌ ఖాతాలో కెట్టో లింక్‌ను షేర్ చేసి పంత్‌ సాయం కోరాడు. ‘‘హలో.. నేను కార్తికేయ మౌర్య. చండీగఢ్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ చదువుతున్నా. నా కుటుంబంపై ఆధారపడకుండా ఎస్‌ఈవో స్పెషలిస్ట్‌గా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నా. గత కొన్ని నెలలుగా స్థిరమైన ఉపాధి లేక నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. మీ సాయం నా జీవితాన్ని మార్చగలదు’’ అంటూ పోస్ట్ చేశాడు. దాంతో స్పందించిన పంత్ ‘మీ కలలను నేరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండండి. దేవుడు మంచి ప్రణాళికలు సిద్ధం చేసే ఉంటాడు’ అంటూ పంత్‌ రీపోస్ట్‌ చేస్తూ డబ్బులు పంపించాడు. దాంతో నెటిజన్లు ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share