Current Date: 07 Oct, 2024

శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం...

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఆణివార ఆస్థానం పర్వదినాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సర్వభూపాల వాహనంలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామిని బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో తీసుకురానున్నారు. అలాగే ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు పుష్ప పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆణివార ఆస్థానం నేపథ్యంలో రేపు శ్రీవారి ఆలయంలో అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈరోజు సిఫార్సు లేఖల స్వీకరణను కూడా టీటీడీ రద్దు చేసింది.

Share