Current Date: 05 Oct, 2024

అక్రమ మద్యంపై టాస్క్‌ఫోర్స్‌ ఉక్కు పాదం

నగరంలో అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు నిఘా పెంచారు. అక్కయ్యపాలెంలోని జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని ఓ ఇంట్లో గుట్టుగా మద్యం విక్రయిస్తున్నారంటూ సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శుక్రవారం దాడి చేయగా, చెన్నైకు చెందిన తిరుపతిరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఫోర్త్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు.