Current Date: 22 Sep, 2024

ఆసుపత్రిలో పొట్టపై తొక్కి డెలివరీ చేసిన నర్సులు శిశువు మృతి

తెలంగాణలోని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఇద్దరు నర్సులు పాశవికంగా డెలివరీ చేశారు. ఫలితంగా పుట్టిన కాసేపటికే పండంటి బాబు మృతి చెందాడు.సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రం పోడు తండాకు చెందిన రేణుకకు.. పురిటి నొప్పులు రావడంతో హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. ఉదయం నుంచి తన భార్య నొప్పులతో బాధపడుతున్నా  డాక్టర్లు పట్టించుకోకపోవడంతో భర్త నిలదీశాడు. అయినప్పటికీ వైద్యులు ఏమాత్రం స్పందించలేదు. అనంతరం నర్సులు వచ్చి రేణుకకు డెలివరీ చేశారు.రేణుకకు సాధారణ ప్రసవం చేసేందుకు నర్సులు ప్రయత్నించారు. ఎంతకూ డెలివరీ కాకపోవడంతో నర్సులు   కాలుతో పొట్టను తొక్కారు. దాంతో  బాబు బయటకు వచ్చాడు. కానీ.. పురుడు పోసుకున్న కాసేపటికే బాబు పరిస్థితి విషమించడంతో.హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Share