Current Date: 23 Sep, 2024

తిరుమల కల్తీ లడ్డూపై సిట్ కు ఆదేశించిన ప్రభుత్వం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తుకు కూటమి ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరు, విధివిధానాలతో జీవోను విడుదల చేసే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న మంత్రులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పేనని ఆయన అన్నారు. తిరుమలో మహా అపచారానికి పాల్పడ్డారని చెప్పారు. టీటీడీని వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు.

Share