Current Date: 23 Sep, 2024

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో హిందూ వాదులు, బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులు వెల్లడయ్యాయి. ఈ విషయంపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో హిందూవాదులు, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జగన్ నివాసం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. తాడేపల్లి జగన్ నివాసం ఇంటి గేటుపై చెప్పులు విసరడంతోపాటు గేటుకు కాషాయం రంగు పూసి తమ నిరసన తెలియజేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగంలోకిదిగి నిరసన కారులను అరెస్టు చేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Share