Current Date: 07 Oct, 2024

కడప ఉప ఎన్నికపై రేవంత్ రెడ్డి కామెంట్స్ వైరల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలకు హాజరైన రేవంత్ రెడ్డి కడప లోక్ సభ ఉప ఎన్నికలపై కామెంట్ చేశారు.కడప లోక్ సభ ఉపఎన్నికలకు సంబంధించి ఈ మధ్య సోషల్ మీడియాలో పలు కథనాలు చక్కర్లు కొడుతున్నారు. జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కడప లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీకి వెళ్లే ఇష్టం లేని జగన్ పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే వైఎస్ షర్మిల కూడా పుంజుకుని.. 2029 నాటికి ఏపీకి సీఎం అవుతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఒకవేళ కడప పార్లమెంట్‌కు ఉపఎన్నికలు జరిగితే వైఎస్ షర్మిల తరుఫున తాను ప్రచారం చేస్తానని ప్రకటించారు. వైఎస్ షర్మిల విజయం కోసం కడప లోక్ సభ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share