Current Date: 07 Oct, 2024

విశాఖలో అగనంపూడి సిగ్నల్ వద్ద దారుణ హత్య హతుడు క్యాబ్ డ్రైవర్

ఒకపక్క కొడుకు పుట్టాడని ఆనందం పడాల, మరో పక్క భర్త హత్యకు గురై కానరాని లోకానికి వెళ్లిపోయాడా దుఃఖపడాలా అనేది  ఆ ఇల్లాల్ని శోకసముద్రంలో ముంచేసింది. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగనంపూడి ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ వద్ద యువకుడు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. హత్య గురైన యువకుడు  సూర్య (25)గా మల్కాపురం ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ గా  పోలీసులు గుర్తించారు.  క్యాబ్ డ్రైవర్ సూర్యను ఓ యువకుడు మంగళవారం తెల్లవారుజామున కత్తితో అగనంపూడి సిగ్నల్ వద్ద కత్తితో పొడిచి  పారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అతనిని కేజీహెచ్ కి తరలించే లోపే మృతి చెందాడు. మృతిని భార్య అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇంతలో భర్త సూర్య దారుణ హత్యకు గురికావడంతో  భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share