Current Date: 04 Oct, 2024

కేటీఆర్, హరీశ్ రావుపై కేసు నమోదు కొత్త ట్విస్ట్!

తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, వారి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రఘునందన్ రావు పేర్కొన్నారు.తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలసిందే. అయితే, సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తెలిపారు.నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని కొండా సురేఖ అన్నారు.

Share