Current Date: 07 Oct, 2024

సాయిరెడ్డి ఫ్రస్టేషన్‌ ` అరె..ఒరేయ్‌..అంటూ మీడియాపై చిందులు

వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంస్కారం మర్చిపోయినట్టున్నారు. బహిరంగంగా మీడియా సమావేశంలో జర్నలిస్టుల్ని ఏకవచనంతో, పరుష పదజాలంతో వ్యాఖ్యానిస్తూ తన అహంకారాన్ని, అక్కసు వెళ్లగక్కారు. సాయిరెడ్డి వైఖరిపై సీనియర్‌ జర్నలిస్టులు మండిపడుతున్నారు. దేవాదాయ శాఖ అధికారిణి శాంతి వర్సెస్‌ విజయసాయి రెడ్డి వ్యవహారంలో ఆమె భర్త చేసిన ఆరోపణలు తీవ్ర వివాదం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శాంతి ఇప్పటికే స్పందించగా తాజాగా విజయసాయి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏం జరిగింది, వాస్తవమేంటని వివరంగా చెప్పాల్సింది పోయి మీడియా ప్రతినిధులతో నువ్వు, చెప్పరా అంటూ సంబోధించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండిరచే క్రమంలో మీడియాపై అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకూ సమంజసమో ఆయనకే తెలియాలి. ఈ వ్యవహారంపై వార్త నడిపిన మహా టీవీ సీనియర్‌ జర్నలిస్టు వంశీపై వాడూ వీడూ అంటూ తీవ్రమైన అహంకారంతో మాట్లాడారు. మీడియా సమావేశమనే ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. ప్రశ్నించిన ఒక విలేకరిని ఉద్దేశించి అరె..చెప్పరా బాబూ అంటూ చులకనగా మాట్లాడటం అందరికీ ఆగ్రహం తెప్పించింది. 

Share