Current Date: 07 Oct, 2024

శాంతి, సుభాష్‌ వివాదంలో కొత్త మలుపు

దేవదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ (ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు) కె.శాంతి రెండో భర్త సుభాష్‌ మధ్య జరుగుతున్న వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. శాంతి బిడ్డతో తనకేమీ సంబంధం లేదని, పరిచయం ఉన్నంత మాత్రాన ఏవేవో అనేస్తే ఎలా అంటూ ప్రభుత్వ న్యాయవాది సుభాష్‌ రెడ్డి మరో న్యాయవాదితో మాట్లాడుతున్న ఆడియో ఇప్పటికే వైరలైంది. మరోవైపు శాంతితో పాటు ఆమె బిడ్డ, ఇరువర్గాల కుటుంబ సభ్యులతో కలిసి సుభాష్‌ రెడ్డి ఆ బిడ్డను ఎత్తుకోవడం, బారసాలకు హాజరుకావడం, దుర్గగుడిలో పూజలు చేయించిన ఫొటోలు ఫేస్‌ బుక్‌లో కనిపించాయి. దీంతో సుభాష్‌ చెబుతున్న మాటలకు చెల్లుచీటీ పలికినట్టయింది. శాంతి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మొదటి భర్త మదన్‌ (వారిద్దరి మధ్య చోటు చేసుకున్న తగాదాల కారణంగా) అనేక ఆరోపణలు చేశారు. వాస్తవానికి తాను అక్టోబర్‌ 14, 2021నే సుభాష్‌ను పెళ్లి చేసుకున్నానని శాంతి ఇదివరకే చెప్పారు. సుభాష్‌ ద్వారానే తనకు బిడ్డ పుట్టాడని కూడా తెలియజేశారు. తనపై బురద జల్లేందుకే మొదటి భర్త మదన్‌ లేని పోని ఆరోపణలు చేస్తున్నాడని ఇటీవల మీడియా ఎదుట కూడా చెప్పారు. 

Share