Current Date: 02 Oct, 2024

విభజించి పాలించే బ్రిటిష్ విధానాలలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తుంది -వై ఎస్.షర్మిల రెడ్డి

దేశంలో విభజించి, పాలించు బ్రిటీష్ సిద్ధాంతాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తోందని ఆంధ్ర ప్రదేశ్  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర (పిసీసీ) అధ్యక్షురాలు వై ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఈకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో బుధవారం ఆమె పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ  మహాత్మా గాంధీ అహింస వాదిగా పోరాటం చేసి ఆనాడు స్వాతంత్రం సాధించారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా, సత్యాగ్రహ దీక్ష ఉద్యమంలను ఆయుధాలుగా  చేసుకున్నారన్నారు. నేటి పాలకులు మహాత్మా గాంధీని చంపిన ఆర్ ఎస్ ఎస్, గాడ్సే సిద్ధాంతాలను అమలు చేస్తున్నారని మండి పడ్డారు. 

Share