Current Date: 02 Oct, 2024

ఏపీలో చెత్త పన్ను రద్దు

రాష్ట్రంలో బుధవారం నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు   ఏపీ సీఎం చంద్రబాబు  ప్రకటించారు. ఎక్కడా చెత్తపన్ను వసూలు చేయొద్దని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకెళ్లారు. బానిసత్వం వద్దు.. స్వాతంత్య్రమే ముద్దు అని నినదించారు. 2014 అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. దీనికి అందరం ఆయనకు అభినందనలు చెప్పాలి. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛభారత్‌పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను ఛైర్మన్‌గా ఉన్నాను. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 2లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ఏపీని ఓడీఎఫ్‌ రాష్ట్రంగా మార్చాం. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద వైద్యకళాశాల ఏర్పాటు చేస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

Share