Current Date: 02 Oct, 2024

విద్యార్థులతో కలిసి మోడీ స్వచ్ఛభారత్‌

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.    ‘నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాను. మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ చొరవ స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది’ అని మోదీ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇక, ప్రధాని  పిలుపుమేరకు పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.   2014 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ‘స్వచ్ఛ్‌ భారత్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.

Share