Current Date: 07 Oct, 2024

అబార్షన్ చేయించాడు రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో కొత్త ట్విస్ట్‌

రాజ్‌తరుణ్‌-లావణ్య కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతూ తాజాగా ఓ కొత్త ట‌ర్న్ తీసుకుంది.  ఇప్పుడు ఈ ఘ‌ట‌న టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. బుధ‌వారం లావణ్య మ‌రోసారి రాజ్ తరుణ్, మాల్వీల‌పై ఫిర్యాదు చేసింది.రాజ్‌తరుణ్‌తో పదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని, ప‌దేండ్లుగా కాపురం చేశామని.. కొన్నాళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వ‌స్తే అబార్షన్ చేయించాడంటూ లావణ్య ఆరోపించింది. అందుకు సంబంధించి మెడికల్ డాక్యుమెంట్స్‌ను పోలీసులకు అందించానని తెలిపింది. అంతేకాకుండా చాలాకాలం అన్విక పేరుతో కలిసి ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు కూడా కలిసి వెళ్లిన‌ట్లు లావ‌ణ్య‌ పేర్కొంది.కొంత‌కాలం క్రితం కానీ మాల్వీ మ‌ల్హోత్రా వచ్చాక రాజ్‌తరుణ్‌ తనను దూరం పెట్టాడని వివరించింది.  దీంతో నార్సింగ్ పోలీసులు రాజ్ త‌రుణ్‌పై  ఐపీసీ 493 సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసులన‌మోదు చేశారు.

 

Share