Current Date: 06 Oct, 2024

పీఎంవోలో మోడీ తొలి సంతకం దేనిపైనంటే..?

కేంద్రంలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆదివారం సాయంత్రం 71 మంది సహచరులతో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రధాన మంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోడీ.. రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిచ్చారు. పీఎం కిసాన్‌ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. ఈమేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ వీడియోను విడుదల చేసిందిముచ్చటగా మూడోసారి పీఎంవోలో అడుగు పెడుతున్న మోడీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఇరువైపులా నిల్చుని సంప్రదాయబద్దంగా నమస్కరిస్తూ మోడీకి స్వాగతం చెప్పారు. సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోడీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టారు. 

Share