Current Date: 03 Oct, 2024

బెజవాడ దుర్గమ్మకు వజ్ర కిరీటం బహూకరణ

బెజవాడ దుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని సమర్పించారు. సుమారు రూ.2.5 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆలయ పాలకమండలి సభ్యులు తెలిపారు. గురువారం నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించే భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

Share