Current Date: 06 Jul, 2024

బ్యాండ్ బాజాల తో ఓటర్లకు స్వాగతం

లోక్సభఎన్నికల చివరి దశ పోలింగ్లో భాగంగా పంజాబ్లోని అమృత్సర్లో ఏర్పాటు చేసిన సూపర్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఆకట్టుకుంటోంది.ఓటర్లను బ్యాండు బాజాలతో ఆహ్వానిస్తున్నారు.దీంతో బూత్ వద్ద ఉల్లాస వాతావరణం నెలకొంది.మొత్తం 57 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు.ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం వివిధ ఏర్పాట్లు చేస్తోంది.