Current Date: 25 Sep, 2024

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచనేలేదు: మంత్రి నారా లోకేశ్‌

 స్టీల్‌ప్లాంట్‌ అంశంపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎంచంద్రబాబు చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు. వైకాపా మాత్రం ప్రతిరోజూ ఎక్స్‌లో పోస్ట్‌ పెడుతుంది. ఇంకా వాళ్లకు బుద్ధిరాలేదు’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Share