Current Date: 25 Sep, 2024

అన్ని జిల్లాలకు ఎయిర్పోర్టు కనెక్టివిటీ కి ఏర్పాట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్

ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశా లున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలి పారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రోత్సాహ కాల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని తెలిపారు. విశాఖ రీజియన్ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నా రు. గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్టు కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నామని వివరిం చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్ గా విశాఖ రూపుదిద్దుకుంటోందని లోకేశ్ తెలిపారు.

Share