Current Date: 24 Sep, 2024

విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం

చత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతుండగా రాళ్లు విసిరిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ - ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలు శుక్రవారం ఉదయం విశాఖపట్టణం నుంచి వస్తుండగా బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద నిందితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ రైలుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ సీ2-10,  సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నిందితులు శివకుమార్ బఘేల్, దేవేంద్ర కుమార్, జీతు పాండే, సన్వానీ, అరుణ్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share