Current Date: 24 Sep, 2024

జనసేన స్టార్ క్యాంపెయినర్‌ జానీ మాస్టర్‌పై రేప్ కేసు నిత్యం వివాదాలు

జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ  మాస్టర్  పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. మధ్యప్రదేశ్‌కి చెందిన 21 ఏళ్ల మహిళ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా గత ఆరు నెలలుగా పనిచేస్తోంది. అయితే ఔట్ డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది.అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. ఈ ఏడాది జూన్‌లోనూ జానీ మాస్టర్‌పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు.2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్‌కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015లో ఓ కాలేజీలో జరిగిన గొడవ విషయమై ఇలా తీర్పిచ్చింది. ఇలా జానీ మాస్టర్ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున జానీ ప్రచారం చేశాడు.

Share