Current Date: 27 Sep, 2024

ఫ్యామిలీ కోసం మహిళ ప్రెగ్నెన్సీ నాటకం చివరికి దొరికిందిలా

పిల్లలు పుట్టకపోవడంతో ఏం చేయాలో తోచని వివాహిత తాను గర్భం దాల్చినట్లుగా భర్త, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. చివరకు నొప్పులొస్తున్నాయంటూ ఆసుపత్రికి వెళ్లి అక్కడ కూడా చాలా సేపు నాటకం ఆడింది. కానీ.. చిన్న తప్పిదంతో అడ్డంగా దొరికిపోయింది.తెలంగాణలోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితకు పెళ్లి అయ్యి రెండేళ్లు అయినా సంతానం కలగలేదు. దాంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాను గర్భం దాల్చినట్లు కొద్ది నెలలుగా ఇంట్లో వారిని నమ్మించింది. ఇటీవల జనగామ ఎంసీహెచ్‌ ఆసుపత్రికి వచ్చి ఓపీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది.నిన్న మళ్లీ వెళ్లి తనకు పురిటినొప్పులు వస్తున్నాయని ఓపీలో నమోదు చేయించుకుంది. నిజమేననుకున్న వైద్యురాలు సాధారణ కాన్పు చేస్తామని చెప్పింది. ఇంతలో ఆమె బాత్‌రూమ్‌కు వెళ్లి అందులో నుంచి అరిచి తనకు రక్తస్రావమైందని, పిండం పడిపోయిందని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన వైద్యురాలు మౌనిక, ఇతర వైద్య సిబ్బంది బాత్‌రూమ్‌లో పరిశీలించగా ఎలాంటి రక్తస్రావం ఆనవాళ్లు లభించలేదు. 

Share