Current Date: 05 Oct, 2024

పార్లమెంట్‌లోకి వర్షపునీరు.. జైరాం రమేశ్ ఫన్నీ ట్వీట్!

భారీ వర్షాలతో ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌కి కొత్త విమర్శనాస్త్రాన్ని అందించింది. ఇప్పటికే నీట్‌తో సహా.. 70 పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ లీకవడంపై మోడీ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా ఢిల్లీలో వర్షాలకు నూతన పార్లమెంట్‌ భవంతిలోని లాబీ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారగా పడుతోంది.దొరికిందే ఛాన్స్‌లా పేపర్‌ లీకేజీలను వాటర్‌ లీకేజీతో ముడిపెడుతూ విపక్షాలు భవన నిర్మాణ పటిష్టతను ఎత్తిచూపాయి. ‘ పేపర్‌ లీకేజీ బయట. వాటర్‌ లీకేజీ లోపల. రాష్ట్రపతి విచ్చేసినపుడే వినియోగించే లాబీ పైకప్పు నుంచి ధారగా పడుతున్న వర్షపు నీరు.. భవంతి ఏ మేరకు పటిష్టంగా ఉందనే చేదు నిజాన్ని చాటుతోంది’ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. 

Share