Current Date: 07 Oct, 2024

పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభం

పార్లమెంట్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి ఎన్డీఎ భాగస్వామ్య పక్ష పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల ఎంపీలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వాఖ్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై చర్చించనున్నారు. నేడు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు.

Share