Current Date: 06 Jul, 2024

చెక్ డ్యాములో ముగ్గురు యువకులు గల్లంతు....


విజయనగరం జిల్లా జామి మండలం జాగరం వద్ద చెక్ డ్యాములో  ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గోస్తనీ నది చెక్ డ్యామ్ కు ఈ రోజు ఉదయం ఈత కోసం ఆరుగురు అబ్బాయిలు వచ్చారు. మొదట ఒకరు మునిగిపోవడంతో  రక్షించడానికి ఒకరి తర్వాత ఒకరు నీటిలోకి దిగారు. ఇలా  ముగ్గురు గల్లంతు కాగా... మిగతా వారు ఒడ్డుకు చేరుకొని స్థానిక అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులు విజయనగరం కంటోన్మెంట్ కు చెందిన  అశోక్ , షాకిత్, రజాక్  గా గుర్తించారు. ఈ ప్రమాదానికి చెక్ డ్యామ్ దిగువ భాగంలో అక్రమ తవ్వకాలే కారణమని  స్థానికులు పేర్కొంటున్నారు.