Current Date: 29 Sep, 2024

అల్లూరి జిల్లాలో విరిగిపడిన కొండచరియలు ఒకరి మృతి ముగ్గురు గల్లంతు


 భారీ వర్షాల కారణంగా అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. పలు  ఇళ్లు ధ్వంసమయ్యాయి.  సీలేరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో జేసీబీతో ఘటనాస్థలికి సహాయక బృందం చేరుకుంది. అంతర్రాష్ట్ర రహదారిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్ర రహదారిలో.. నర్సీపట్నం-భద్రాచలం రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సీలేరు-ధారకొండ మధ్య 12 చోట్ల కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 కి.మీ మేర పలు చోట్ల విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

Share