Current Date: 29 Sep, 2024

బోట్లు ఢీకొట్టిన కేసులో ఇద్దరి అరెస్ట్‌

ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసులో పోలీసులు బోట్ల యజమానులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. కాగా, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. ఈ సంఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో వెల్లడిరచారు. ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలవని నిర్ధ్ధారించారు.   ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడిరచారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్‌.. ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునే వారని చెప్పారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామన్నారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఉషాద్రి, కర్రి నరసింహాస్వామి, గూడూరు నాగమల్లేశ్వరీలకు చెందినవిగా గుర్తించారు.

Share