Current Date: 29 Sep, 2024

బుడమేరు పరివాహక ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌

బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పరివాహక ప్రాంతంలో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీంతో బుడమేరుకు ఏ క్షణమైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గుణదల, సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యానచంద్ర సూచించారు.

Share