Current Date: 06 Jul, 2024

సీజనల్‌ వ్యాధులపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని...5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీజనల్‌ వ్యాధులపై సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం  సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్‌ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని....ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు. ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు (బెస్ట్‌ ప్రాక్టీసెస్‌) అన్నీ మళ్లీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Share