Current Date: 06 Jul, 2024

రాజకీయ దాడులపై వైసీపీ ఫిర్యాదు

ఎన్టీఆర్‌ జిల్లాలో ఎన్నికల తర్వాత జరుగుతున్న రాజకీయ దాడులుకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణకు వైసీపీ నాయకులు  వినతిపత్రం అందజేశారు. పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు   నగర మేయర్‌ భాగ్యలక్ష్మి , నందిగామ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌, పార్టీ నాయకులు షేక్‌ ఆసిఫ్‌, స్వామి దాసు, కైలే అనిల్‌ కుమార్‌ , తిరుపతి రావు , పోతిన వెంకట మహేష్‌, న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు.

Share