Current Date: 06 Jul, 2024

జగన్‌ కేసులు రోజు వారీ విచారణకు హైకోర్టు ఆదేశం

ఏపీ మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్‌ కేసులపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్‌ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. జగన్‌ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.

Share