Current Date: 02 Jul, 2024

మెగా డీఎస్సీకి కేబినెట్‌ ఓకే

 మెగా డీఎస్సీ నిర్వహణకు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.  క్యాబినెట్‌ తొలి సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.  సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చించారు. జూలై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించాలని, డిసెంబర్‌ 10 నాటికి 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే టెట్‌ ద్వారా డీఎస్సీ నిర్వహించాలా టెట్‌ లేకుండానే నిర్వహించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకోవలసి ఉంది.

Share