Current Date: 05 Oct, 2024

నీటిలో తేలాడు.. ఓట్లలో మునిగాడు

నీట్లో వెల్లకిలా పడుకొని అందర్నీ ఆశ్చర్య పరిచిన కొలగొట్ల వీరభద్రస్వామి ఓట్ల ఎన్నికలలో మాత్రం నిలువుగా మునిగిపోయారు. యోగ విద్య ద్వారా కొలగొట్ల ఆ మధ్య స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకి గంటలసేపు వెల్లకిలా పడుకొని వార్తల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. విజయనగరం శాసనసభ్యునిగా ఆయన పిలిస్తే పలికే నాయకుడంటూ పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే వైసీపీ పాలసీలో భాగంగా భూకబ్జాల్లో కూడా అందె వేసిన చేయిగా వార్తల్లోకి ఎక్కారు. అయినా ఎన్నికలలో తన విజయం ఖాయం అంటూ తెగ ధీమాగా పోటీలోకి దిగారు. పోటీ చేస్తున్నది అశోక్‌గజపతి రాజు గారి కూతురే కదా అని చిన్నచూపు చూశారు. నీటి మీద పడుకున్నోడిని గెలుపు నల్లేరు మీద నడవలేనా అనుకున్నారు. కానీ ఫలితాలు వెలువడ్డాక అర్థమయింది నీట్లో తేలాను గాని, ఓట్లలో మునిగానని. అంతేకాదు ఓడిపోతే రాజుగారి చేతిలో ఓడిపోయిన బాగుండేది కానీ రాజుగారి కూతురు చేతుల్లో పోవడాన్ని కొలగట్ల అస్సలు దిగమింగి కోలేక పోతున్నారట. పైగా తనకి 60,632 ఓట్లు పోలయితే, రాజు గాని కూతురు అదితి గజపతిరాజుకు మాత్రం మెజార్టీనే 60,609 ఓట్లు వచ్చాయని కొలగొట్ల తెగ గించుకుపోతున్నారట.