Current Date: 07 Oct, 2024

ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు

 ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లోని ఎన్టీఆర్‌ అడ్మినిస్ట్రేటివ్‌  బ్లాక్‌ రెండవ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి హిమాన్షు శుక్లాకు జాయింట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ స్వాగతం పలికారు. సిబ్బందిని పరిచయం చేశారు. పుష్పగుచ్ఛాలతో ఉద్యోగులు, సిబ్బంది శుక్లాకు అభినందలు తెలిపారు. గతంలో డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం చూపించడంలో తనదైన ముద్ర వేశారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాన్షు శుక్లా ఐఅండ్‌పీఆర్‌ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు.  సమాచార, పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు.

Share