Current Date: 25 Sep, 2024

టీడీపీకి తలనొప్పిగా మారిన సీతంరాజు సుధాకర్‌

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన ` టిడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. ఇటు ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్‌, అటు ఎంపీ భరత్‌లు వేరువేరుగానే దక్షిణ నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తుండడంపై పెద్ద చర్చనే జరుగుతోంది. రెండు రోజుల క్రితం వంశీకృష్ణ యాదవ్‌ను ముస్లిం నాయకులు కలుసుకుని తమ సమస్యల్ని విన్నవించుకున్నారు. అయితే ఇది తెలిసిన ఎంపీ భరత్‌ ముస్లిం నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయించుకున్నారు. దీనిని దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన సీతంరాజు సుధాకర్‌ కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీలో చక్రం తిప్పి ఎన్నికలు ముందు టీడీపీలోకి అడుగుపెట్టిన సుధాకర్‌ వల్ల టీడీపీ కార్యకర్తలు,  వార్డు నాయకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించే పరిస్థితిలో లేని ఎంపీ శ్రీ భరత్‌ అయోమయంలో వుంటూ సుధాకర్‌ చెప్పినట్టే తలడిస్తూన్నారన్న అపవాదు గట్టిగా వినిపిస్తోంది. అంతేకాకుండా కూటమి అభ్యర్థిగా గెలిచిన వంశీకృష్ణకు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని సుధాకర్‌ టీడీపీ కార్యకర్తలపై ఆంక్షలు విధించడంపై కూడా చర్చ జరుగుతోంది.

Share