Current Date: 25 Sep, 2024

సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌

ఇవాళ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు . ఉద‌యం  సచివాలయానికి వెళ్ల‌నున్నారు. అనంతరం చంద్రబాబుతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారిద్ద‌రూ విజ‌య‌వాడ వరద బాధితులకు ప్ర‌క‌టించిన విరాళాల తాలూకు చెక్‌ల‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేయ‌నున్నారు. ఇక సీఎం చంద్రబాబు పిలుపుమేరకు వరద సాయం కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి తార‌క్‌, రామ్ చరణ్‌లు విరాళాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రూ ఏపీకి చెరో రూ. 50 లక్షలు చొప్పున విరాళం అందిస్తామ‌ని ఎక్స్ వేదిగా ప్ర‌క‌టించారు.

Share