Current Date: 25 Sep, 2024

పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో పర్యటించనున్న జగన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ నేడు పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద కారణంగా అతలాకుతలమైన గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురంకు వెళ్తారు. అక్కడ వరద బాధితులతో ఆయన మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి యు.కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు. ఆ తర్వాత రమణక్కపేటకు వెళ్లి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం పిఠాపురం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. ఎన్నికల తర్వాత జగన్ తొలిసారి కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి గమనార్హం.

Share