Current Date: 06 Oct, 2024

వాడుక భాషలోనే రామోజీ వార్తలందించారు .. నివాళులర్పించిన గంటా

ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ చెరుకూరి రామోజీరావుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘనంగా నివాళులర్పించారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో శనివారం రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. రామోజీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా గంటా అన్నారు. పత్రిక భాష స్థానంలో సామాన్యుడికి అర్థమయ్యే వాడుక భాషలో వార్తల్ని అందించి అందరికీ చెరువయ్యారని తెలిపారు. రామోజీ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు,  కొయ్య ప్రసాదరెడ్డి, గంటా నూకరాజు, 98వ వార్డు కార్పొరేటర్‌ పీవీ నరసింహం తదితరులు పాల్గొన్నారు.

Share