Current Date: 24 Sep, 2024

లైవ్‌ ఫిష్‌ లారీ బోల్తా చేపల కోసం ఎగబడిన ప్రజలు

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తాతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. బతికున్న చేపల (లైవ్‌ ఫిష్‌) కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపు చేశారు.

Share